AP 207 వార్డు సచివాలయ పరిధిలో నోటిఫికేషన్ ఖాళీ పోస్టుల కోసం

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 207 వార్డు సచివాలయాల్లో వాలంటీర్ల భర్తీ కోసం దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖాళీగా ఉన్న 35 పోస్టులను భర్తీ చేయడం కోసం ఆయా సచివాలయాల్లో నోటీస్ బోర్డ్ లో వివరాలు పొందుపరిచినట్లు పేర్కొన్నారు.పదవ తరగతి పూర్తి చేసి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు లోపు వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు .ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అయితే చెప్పారు .30 వ తేదీన మౌఖిక పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థులు సెప్టెంబర్ ఐదు నుంచి విధుల్లోకి చేరాల్సి ఉంటుందని తెలిపారు.

You may also like...