పంచాయతీ శాఖలో 500 ఉద్యోగాలకు నోటిఫికేషన్

నిరుద్యోగులకు శుభవార్త. గ్రూప్‌-1 పోస్టులకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న 503 పోస్టులను భర్తీ చేయనున్నది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ద్వారా పోస్టులు భర్తీ చేయనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన అనంతరం తొలిసారిగా గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇంటర్వ్యూలు లేకుండానే పోస్టులను భర్తీ చేయనున్నారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను టీఎస్‌పీఎస్సీ స్వీకరించనున్నది.

ఇందులో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి పోస్టులు 5, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు 40, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులు 38 భర్తీ చేయనున్నది. అలాగే అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీస్‌ 20 (పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్), డీఎస్పీ 91, జైళ్లశాఖలో డీఎస్పీ పోస్టులు 2, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ 8, జిల్లా ఉపాధి అధికారి 2, జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి పోస్టులు 6, గ్రేడ్‌-2 మున్సిపల్‌ కమిషనర్‌ పోస్టులు 35 భర్తీ చేయనున్నది. వీటితో పాటు మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి 121, జిల్లా పంచాయతీ అధికారి పోస్టులు 5, సీటీఓ 48, డిప్యూటీ కలెక్టర్లు 42, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 26, ప్రాంతీయ రవాణా అధికారి పోస్టులు 4, జిల్లా జిల్లా గిరిజన సంక్షేమ అధికారి పోస్టులు రెండింటిని భర్తీ చేయనున్నది.

You may also like...